Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చిన తండ్రి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (08:39 IST)
భార్యపై కోపంతో తన ఇద్దరు కుమార్తెలకు ఓ కన్నతండ్రి విషమిచ్చాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం, గూడురు శివారు ప్రాంతమైన జనకీపురం గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ధనలక్ష్మి, శ్రీను అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిద్దరికి పెళ్లి నాటి నుంచి తరచుగా గొడవలు జరుగుతుండేవి. 
 
ఈ నేపథ్యంలో భార్యమీద కోపంతో ఇద్దరు కుమార్తెలకు శీతలపానీయంలో విషం కలిపి తండ్రి శ్రీను ఇచ్చాడు. దీంతో వారు అపస్మారకస్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ప్రాణాలు కోల్పోగా, రెండో కుమార్తె ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఈమెను జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments