Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలో లోక్‌సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు

Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (09:01 IST)
వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా సారథ్యంలో ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందుకోసం వచ్చే వారంలో సీఈసీ సునీల్ అరోరా సారథ్యంలోని ఎన్నికల సంఘం వచ్చేవారంలో సమావేశంకానుంది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. దీనిపై ఈసీ కసరత్తులు చేయాల్సివుంది. 
 
ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు అవసరమైన భద్రతా సిబ్బంది తరలింపు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే పండగలు, ఇతర ముఖ్యమైన రోజులను పరిగణనలోకి తీసుకుని పలు తేదీలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్‌ 7 - మే 12వ తేదీల మధ్య నిర్వహించారు. 
 
అలాగే, ఈ దఫా కూడా ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను విడుతల చేసి ఏప్రిల్‌ 10వ నుంచి మే 10వ తేదీలోపు మొత్తం 9 దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments