Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (11:58 IST)
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడటం లేదు. మహా పంచాయతీ హస్తినకు చేరినప్పటికీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో శివసేన (షిండే) వర్గం అధినేత ఏక్‌నాథ్ షిండే రానున్న 24 గంటల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా, తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. 
 
దీంతో ఆయన మహాయుతి కూటమితో కలిసే ఉంటారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదిలాఉండగా.. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీసీనియర్‌ నేత దేవేంద్ర ఫడ్నివిస్ పేరు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నా.. రేసులో కొత్తగా మురళీధర్‌ మోహోల్‌ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ పుణె ఎంపీ అయిన మురళీధర్‌ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
 
ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీ మంతనాలు జరిగినప్పటికీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ఏక్‌నాథ్‌ షిండే సమావేశమయ్యారు. 'సీఎం ఎవరనే దానిపై భాజపా తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తా. ముంబైలో కూటమి నేతల మధ్య చర్చ జరిగిన తర్వాత రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తాం' అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వెల్లడించారు. 
 
అయితే, ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ సమావేశాన్ని రద్దు చేసి సొంతూరుకు వెళ్లిపోయారు. దీంతో సీఎం ఎంపిక, శాఖల కేటాయింపుల విషయంలో కూటమి నిర్ణయంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఆయన అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్లినట్లు మరికొందరు నేతలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments