Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజిపురాలో తీరని విషాదం - కారు - ట్రక్కు ఢీకొని 8 మంది సజీవదహనం

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (10:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భోజిపురాలోని తీరని విషాదం నెలకొంది. కారు - ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి  సహా మొత్తం ఎనిమిది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ శనివారం రాత్రి బరేలి జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కారు టైరు పేలిపోవడంతో కారు అదుపుతప్పి అవతలి రోడ్డులో పడి.. ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. 
 
పైగా, కారు ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. అదేసమయంలో కారు డోర్లు లాక్ కావడంతో కారులోని వారంతా తప్పించుకోలేకపోయారు. మంటల్లో అందరూ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి సహా మొత్తం ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments