Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన దేశంలో ఈజిప్టు మమ్మీ.. అసలేం జరిగిందో తెలుసా?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:50 IST)
జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో 2,400 ఏళ్ల వయస్సు గల మమ్మీని వరదలో మునిగిపోకుండా ఉండడానికి గత 130 సంవత్సరాల తరువాత మొదటిసారి పెట్టె నుంచి బయటకు తీశారు.

ఆగస్టు 14న జైపూర్‌లో కురిసిన వర్షాలకు మ్యూజియంలోకి నీరు ప్రవేశించింది. వరదనీరు మోకాలి లోతుకు చేరుకోవడంతో పెట్టెలో భద్రపరచబడిన మమ్మీని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని సెంట్రల్ మ్యూజియం సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ చోలాక్ తెలిపారు.

ఆలస్యమైతే ఈజిప్ట్ నుంచి రాజస్థాన్‌కు 130 ఏండ్ల క్రితం తెచ్చిన ఈ మమ్మీ శాశ్వతంగా నాశనం అయ్యేదని ఆయన తెలిపారు. అందువల్ల గాజు పెట్టెను పగులగొట్టి మమ్మీని సురక్షిత ప్రదేశంలో ఉంచామని ఆయన తెలిపారు

ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో ప్రదర్శించబడిన ఈ మమ్మీని కైరో నుంచి 130 సంవత్సరాల క్రితం తీసుకువచ్చారు. ఇది టుటు అనే మహిళది. ఈజిప్టులోని పురాతన నగరమైన పనోపోలిస్ అఖ్మిన్ ప్రాంతంలో ఇది కనుగొనబడింది.

ఏప్రిల్ 2017లో ఈ మమ్మీని జైపూర్ లోని ఆల్బర్ట్ హాల్ నేలమాళిగకు మార్చారు. దాని చరిత్ర, జనన-మరణ, ఎక్స్‌రే తదితర వివరాలను మ్యూజియంలో ఉంచారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments