Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ ముందుకు జమ్మూ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా.. కాషాయ పార్టీని..?

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:03 IST)
omar
జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఈడీ ముందుకు వచ్చారు. ఈడీ ఆదేశాల మేర‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్ధుల్లా వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
జమ్మూ క‌శ్మీర్ బ్యాంకుకు సంబంధించిన కేసులో ఒమ‌ర్ అబ్దుల్లాపై కూడా ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒమ‌ర్ అబ్దుల్లాను విచారించినట్టు స‌మాచారం. 
 
ఈ వ్యవహారంలో తన వైపు నుండి ఎటువంటి తప్పు లేనందున సహకరిస్తానని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒమర్ అబ్ధుల్లా రాశారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ నిలబడినా, కేంద్ర ఏజెన్సీలు తమపై అధికార "దుర్వినియోగం" చేస్తున్నాయని అన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం అలవాటు చేసుకుందని, అదే దిశలో ఇది మరో ముందడుగు అని ఒమర్ మండిపడ్డారు. 
 
బీజేపీకి అర్థవంతమైన వ్యతిరేకతను వ్యక్తం చేసే ఏ రాజకీయ పార్టీని కూడా వదిలిపెట్టలేదని, అది ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ అయినా సరే, ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఎన్సీ తన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments