Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"నీట్" ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Advertiesment
neet
దేశంలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం జూలై 17వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇందుకోసం వచ్చే నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో 543 నగరాలు, పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ విభాగాల్లో 50 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్షను నిర్వహించనుంది. 
 
ఒక్కో ప్రశ్నకు ఒక నిమిషం చొప్పున సమయాన్ని కేటాయించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, 2022 నుంచి నీట్ పరీక్షను రాసేందుకు విద్యార్థుల్లో గరిష్ట వయోపరిమితిని కూడా ఎత్తివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్‌లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?