Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ కోసం తల నరుక్కునేందుకు సిద్ధం : మంత్రి ఆదిమూలపు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం తాను తల తెగ నరుక్కునేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏపీ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి పునర్‌‌వ్యవస్థీరకరించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 25 మంది మంత్రుల్లో కేవలం ముగ్గురు లేదా నలుగురు మినహా మిగిలినవారందరూ తమతమ మంత్రిపదవులను కోల్పోనున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా సీఎం జగన్ తనకు గొప్ప అవకాశం ఇచ్చారన్నారు. పైగా, జగన్ నాయకత్వంలో పని చేయడం గొప్ప అనుభవమన్నారు. సీఎం లక్ష్యాలకు అనుగుణంగా, ఆయన అంచనాలను అందుకునే విధంగా శాయశక్తులా పని చేశానని తెలిపారు. అందుకే జగన్ కోసం తన తల కోసుకోవడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. 
 
గత పాలకులు రాష్ట్రంలో విద్యను, విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. విద్య పేదరికానికి అడ్డురాదన్నదే సీఎం జగన్ నినాదమన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు జగన్ శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments