Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు విచారణకు బ్రేక్ ఇచ్చిన ఈడీ - అమ్మ చెంతకు రాహుల్

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (07:41 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం బ్రేక్ ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, అందువల్ల విచారణను సోమవారానికి వాయిదా వేయాలంటూ రాహుల్ లేఖ రాశారు. కానీ, ఈడీ అధికారులు మాత్రం శుక్రవారం ఒక్క రోజు విచారకు బ్రేక్ ఇచ్చారు. పైగా, శనివారం విచారణ కొనసాగిస్తారా లేదా వాయిదా వేస్తారా అనే అంశంపై సస్పెన్స్‌గా ఉంచారు. 
 
నేషనల్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గత మూడు రోజులుగా విచారిస్తున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం 28 గంటల పాటు విచారిచారు. శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. 
 
అయితే, ఈ విచాణమను సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ ఈడీని కోరారు. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. తన తల్లి సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతోందని ఆమె ఆస్పత్రిలో ఉందని లేఖలో వివరించారు. దీంతో శుక్రవారం విచారమకు ఈడీ అధికారులు బ్రేక్ ఇచ్చారు. అయితే ఈడీ వర్గాల సమాచారం మేరకు రాహుల్ వినతికి ఈ నెల 20వ తేదీ సోమవారానికి వాయిదా వేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments