Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు : సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (13:58 IST)
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన విద్యార్థులకు వార్షిక ఆదాయంగా 8 లక్షల పరిమితిని విధించామని, దాన్ని పెంచొద్దని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం ఒక అఫిడవిట్‌ను సమర్పించింది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే ప్రస్తుత విద్యా సంవత్సరానికి వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు అమలు చేస్తామని పేర్కొంది. ముఖ్యంగా నీట్ రాసిన విద్యార్థులకు ప్రవేశాలు, కాలజీలను కేటాయిస్తున్న తరుణంలో నిబంధనలు మార్చడం వల్ల సమస్యలు ఏర్పడతాయని పేర్కొంది. సవరించిన నిబంధనలను వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపింది. 
 
నిజానికి సవరించిన నిబంధనల్లో రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని కేంద్రం సర్కారు కొనసాగించింది. వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కంటే అంతకుమించి ఎక్కువ ఉన్న వారిని మినహాయించింది. రూ.8 లక్షల ఆదాయ పరిమితిని క్రితం విచారణ సందర్భంగా కేంద్రం సమర్థించుకుంది. 
 
అయితే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి ఆదాయం, మెట్రో ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఆదాయంతో ఎలా ముడిపెడతారంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో నిబంధనలు సవరిస్తామని కోర్టుకు తెలిపింది. అయితే, ఇపుడు సవరించిన నిబంధనలను వచ్చే యేడాది నుంచి అమలు చేస్తామంటూ కోర్టుకు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

ఇండస్ట్రీకి చెడ్డపేరు తెచ్చేవారిపట్ల జాగ్రత్త - కొత్త రూల్స్ పెట్టాలని సూచన : సి.కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

తర్వాతి కథనం
Show comments