Webdunia - Bharat's app for daily news and videos

Install App

9న రాష్ట్రపతికి ఆర్థిక సంఘం నివేదిక

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (06:34 IST)
పదిహేనవ ఆర్థిక సంఘం తన నివేదికను నవంబరు 9వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పిస్తుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుందని తెలిపింది.

కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ నివేదికపై కూలంకషంగా చర్చించారు. నివేదికకు తుదిమెరుగులు దిద్దారు. నివేదికపై ఎన్‌కే సింగ్‌, సభ్యులు అజరు నారాయణ్‌ ఝా, అనూప్‌ సింగ్‌, అశోక్‌ లహిరి, రమేష్‌ చంద్‌ సంతకం చేశారు.

రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పించడానికి కమిషన్‌ సమయం కోరిందని, అన్ని అంశాలపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాత నివేదికను నవంబరు 9వ తేదీన సమర్పిస్తామని రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు ఆ ప్రకటన తెలిపింది.

కమిషన్‌ తన నివేదిక కాపీని ప్రధాని నరేంద్రమోడీకి కూడా సమర్పిస్తుందని వివరించింది. ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సిఫార్సులు నివేదికలో ఉంటాయి. ఈ నివేదికను కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటుకు సమర్పిస్తారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలతో వివిధ స్థాయిల్లో కమిషన్‌ సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపి నివేదికను ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments