Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున వరుస భూకంపాలు.. వణికిపోయిన జనాలు

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (14:41 IST)
దీపావళి రోజున వరుస భూకంపాలు జనాలను వణికించాయి. వరుస భూ కంపాలు అస్సాంతో పాటు ఈశాన్య రాష్ర్టాలను నిలువెల్లా వణికించాయి. పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతినగా… ప్రజలు ప్రాణాలు గుప్పి ట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు.
 
ప్రకంపనల సమయంలో వేర్వేరుచోట్ల ఒకరు షాక్‌తో, మరొకరు గుండెపోటుతో మరణించారు. నాలుగు జిల్లాల్లో 10 మంది గాయపడ్డారు. అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో బుధవారం ఉదయం 7.51 గంటలకు మొదటి భూకంపం సంభవించింది. దాని తీవ్రత 6.4గా నమోదైంది. 
 
దాని ప్రభావం ఈశాన్యంతో పాటు పశ్చిమ బెంగాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది. దీని తర్వాత మధ్యాహ్నంలోపు మరో 10 భూకంపాలు సంభవించాయి. వాటి తీవ్రత మొదటిదాని కంటే తక్కువగానే నమోదైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి భూకంప ప్రభావంపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments