Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై టి.నగర్ హోటల్లో డచ్ యువతి శవం... చంపేశారా? చచ్చిపోయిందా?

చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:39 IST)
చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
టి.నగర్లోని వెంకటేశన్ స్ట్రీట్‌లో వున్న ఓ ప్రముఖ హోటలకి ఆమె సోమవారం వచ్చారు. తన పేరు లిండా ఐరెన్ హీజ్రెకర్ అనీ, తను ఓ జర్నలిస్టునని పరిచయం చేసుకుంది. గురువారం ఉదయం తను వెళ్లిపోతానని చెప్పింది. ఐతే మధ్యాహ్నం 12 దాటినా ఆమె గది తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డూప్లికేట్ తాళాలతో గది తలుపులు తెరిచి చూడగా ఆమె శవమై కనిపించింది. 
 
వెంటనే విషయాన్ని మాంబళం పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని ప్రాధమికంగా తేల్చారు. ఆమె బెడ్ పైన పొడిలాంటి పదార్థాన్ని కనుగొన్నారు. ఐతే ఆమెది ఆత్మహత్యా లేదంటే హత్యా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శవాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెలికి వస్తాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments