చెన్నై టి.నగర్ హోటల్లో డచ్ యువతి శవం... చంపేశారా? చచ్చిపోయిందా?

చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (16:39 IST)
చెన్నైలోని టి.నగర్ లోని ప్రముఖ హోటల్లో డచ్ యువతి శవమై తేలడం చర్చనీయాంశమైంది. తను బస చేసిన హోటల్ గదిలో 24 ఏళ్ల డచ్ యువతి విగత జీవిగా మారింది. గురువారంనాడు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
టి.నగర్లోని వెంకటేశన్ స్ట్రీట్‌లో వున్న ఓ ప్రముఖ హోటలకి ఆమె సోమవారం వచ్చారు. తన పేరు లిండా ఐరెన్ హీజ్రెకర్ అనీ, తను ఓ జర్నలిస్టునని పరిచయం చేసుకుంది. గురువారం ఉదయం తను వెళ్లిపోతానని చెప్పింది. ఐతే మధ్యాహ్నం 12 దాటినా ఆమె గది తలుపులు తెరుచుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది డూప్లికేట్ తాళాలతో గది తలుపులు తెరిచి చూడగా ఆమె శవమై కనిపించింది. 
 
వెంటనే విషయాన్ని మాంబళం పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని ప్రాధమికంగా తేల్చారు. ఆమె బెడ్ పైన పొడిలాంటి పదార్థాన్ని కనుగొన్నారు. ఐతే ఆమెది ఆత్మహత్యా లేదంటే హత్యా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె శవాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెలికి వస్తాయని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments