Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్లో అర్థరాత్రి మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ!

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (14:29 IST)
అమృతసర్ నుంచి కోల్‌కతా వెళుతున్న అకాల్ తఖ్తత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి తలపై టీసీ ఒకరు మూత్ర విసర్జన చేశాడు. బాధితురాలు తన భర్త రాజేశ్ కుమార్‌తో కలిసి కోల్‌కతా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడిని మున్నా కుమార్‌గా గుర్తించారు. పీకల వరకు మద్యం సేవించిన టీసీ మున్నాకుమార్... ఈ పాడుపనికి పాల్పడ్డాడు. బాధితారులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
టీసీ చేసిన పాడుపనికి ఆ మహిళా ప్రయాణికురాలు బిగ్గరగా కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు నిద్రలేచి, పారిపోతున్న టీసీని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ఇటీవలి కాలంలో విమానంలో పలువురు ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటిని మరచిపోకముందే రైలులో ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments