Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ కండువా కప్పుకున్న పెరియార్ మనవడు..

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (10:45 IST)
సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన పెరియార్‌ మనవడే సతీశ్ కృష్ణ కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. పెరియార్‌ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదని డీఎంకే వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే, స్వయంగా పెరియార్ మనవడే బీజేపీలో చేరడం డీఎంకేకు గట్టి సవాల్ అని చెప్పాలి. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం ప్రధానిని ప్రశంసిస్తూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. 
 
కాగా డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్‌కి రుచించలేదు. దీంతో ఆయనతో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్న డీఎంకే.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
 
త్వరలో సెల్వం కూడా మిగతా ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో పాటు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. సెల్వం ఇప్పటికే బీజేపీ నేతలు మరళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లతో పాటు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కూడా కలుసుకున్నట్టు సమాచారం.
 
తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీల్లో అసమ్మతి నేతలు తమ పార్టీలోకి చేరేందుకు మార్గం సుగమం అయ్యిందంటూ కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల మొదట్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments