Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ కండువా కప్పుకున్న పెరియార్ మనవడు..

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (10:45 IST)
సామాజిక ఉద్యమనేత, ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరుగాంచిన పెరియార్‌ మనవడే సతీశ్ కృష్ణ కాషాయ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. పెరియార్‌ నేలపై బీజేపీ ఎప్పటికీ బలపడలేదని డీఎంకే వ్యాఖ్యలను చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే, స్వయంగా పెరియార్ మనవడే బీజేపీలో చేరడం డీఎంకేకు గట్టి సవాల్ అని చెప్పాలి. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే కూకా సెల్వం ప్రధానిని ప్రశంసిస్తూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. 
 
కాగా డీఎంకే ఎమ్మెల్యే కె.కె. సెల్వం ప్రధాని నరేంద్ర మోదీపై బహిరంగంగా ప్రశంసలు కురిపించడం ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్‌కి రుచించలేదు. దీంతో ఆయనతో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్న డీఎంకే.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
 
త్వరలో సెల్వం కూడా మిగతా ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో పాటు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. సెల్వం ఇప్పటికే బీజేపీ నేతలు మరళీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్‌లతో పాటు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కూడా కలుసుకున్నట్టు సమాచారం.
 
తమిళనాడులోని రెండు ప్రాంతీయ పార్టీల్లో అసమ్మతి నేతలు తమ పార్టీలోకి చేరేందుకు మార్గం సుగమం అయ్యిందంటూ కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నెల మొదట్లో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments