Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండా.. ఎక్కడ?

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండా.. ఎక్కడ?
, శనివారం, 15 ఆగస్టు 2020 (10:15 IST)
దేశంలో శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోట ప్రాకారాల నుంచి లదాక్ సరిహద్దు వరకు మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. లడక్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండాను ఎగురవేశారు.

లడక్‌లో వాస్తవ నియంత్రణ రేఖపై కొంతకాలంగా భారత్‌, చైనా మధ్య వివాదం కొనసాగుతోంది. పెన్‌గోంగ్ నది ఒడ్డున ఐటీబీపీ సిబ్బంది 2020 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ఆయన స్మరించుకుంటూ ట్వీట్ చేశారు.
 
దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. కుల, మత, లింగ వివక్షతలేని సమాజ స్తాపనకు కృషిచేస్తూ.. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపు నిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. 90వేలకు చేరిన కేసులు