Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ ఓటరుగా వరుసలో నిలబడి ఓటేసిన తెలంగాణ గవర్నర్

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:53 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. ముఖ్యంగా, హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, కార్తి, శశికుమార్, రెహమాన్, హీరోయిన్లు శృతిహాసన్, అక్షర హాసన్‌లు ఓటు వేశారు. అలాగే, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా సాధారణ పౌరుల్లాగనే వరుసలో నిలబడి తమ వంతు వచ్చినంతవరకు వేచివుండి ఓటు వేశారు.
 
అలాగే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ కూడా తన వంతు వచ్చేంత వరుసలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. ఇందుకోసం కోవిడ్ నిబంధనలకు లోబడి ఎన్నికల ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments