Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి లేనట్టే : తితిదే
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:56 IST)
కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం వాయిదా వేసినట్లు తితిదే ఆలయ అధికారులు తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరిస్థితులు సాధారణస్థితికి రాగానే ఆర్జిత సేవలకు గృహస్తులను అనుమతించే విషయాన్ని ముందుగానే తెలియజేస్తామని వెల్లడించింది.
 
కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు పలు మార్గదర్శకాలు, సూచనుల చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రకారంగా శ్రీవారి దర్శన టిక్కెట్ చేయించుకున్న భక్తులను ముందుగానే కొండపైకి అనుమతించడం కూడా లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని ప్రభావం నుంచి గట్టెక్కాలంటే..? రావి చెట్టు కింద నువ్వుల దీపం.. 51 వారాలు?