Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు ఎన్నికలు : ఓటేసిన రజనీ - కమల్ - స్టాలిన్

తమిళనాడు ఎన్నికలు : ఓటేసిన రజనీ - కమల్ - స్టాలిన్
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (08:18 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ ఒకే దశలో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 
 
ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
webdunia
 
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్‌లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తైనంపేట, ఎల్డమ్స్ రోడ్డులో ఉన్న హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
webdunia
 
అలాగే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, పుదుచ్చేరిలోనూ మంగళవారం ఎన్నికలు జరగుతుండగా, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో మూడో విడత  పోలింగ్ జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు.. మోదీకి షాకిచ్చే నిజం వెలుగులోకి వచ్చిందిగా..?