Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఎంట్రీ ముఖ్యంకాదు.. లైంగిక వేధింపులను అడ్డుకోండి : తస్లీమా నస్రీన్

Taslima Nasreen
Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (10:11 IST)
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలకు బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ చురకలు అంటించారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లాలని మహిళా కార్యకర్తలు ఎందుకంత ఆసక్తి చూపున్నారో తనకు అర్థంకావడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు ఓ సూచన చేశారు. 
 
ఇదే విషయంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. "మీరంతా లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలపై పోరాడటానికి దృష్టిపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. మహిళా కార్యకర్తలు శబరిమలకు బదులు గ్రామాలకు వెళితే బాగుంటుందన్నారు. అక్కడ మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, గృహ హింస, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ఘటనలతో ఇబ్బందులు పడుతున్నారని వారికి అండగా నిలవాలని తస్లీమా నస్రీన్ కోరారు. బాలికలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ, సమాన వేతనాలు పొందడానికి అవకాశాలు లేని గ్రామాలకు వెళితే బాగుంటుందని హితవు పలికారు. 
 
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 యేళ్ళ మధ్య వయసు మహిళలు వెళ్లేందుకు సుప్రీంకోర్టు గత సెప్టెంబరు 28వ తేదీన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, పలువురు మహిళలు ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివారిలో భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ కూడా ఉన్నారు. ఈమె శబరిమలకు వెళ్లేందుకు కోల్‌కతా నుంచి కొచ్చికి వెళ్లగా, ఆమెను అయ్యప్ప భక్తుల ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో ఆమె నిరాశతో వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం