Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ తనయ కాదు నా కుమార్తె : టీడీపీ నేత పెద్దిరెడ్డి

Webdunia
ఆదివారం, 18 నవంబరు 2018 (09:54 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పోటీ చేస్తోంది. ఈమె శనివారం నామినేషన్ దాఖలు చేసింది. వాస్తవానికి ఈ స్థానంపై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి బోలెడు ఆశలుపెట్టుకున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన బలంగా పట్టుబట్టారు. 
 
కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని నందమూరి సుహాసినికి కేటాయించారు. దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ, నందమూరి సుహాసిని తనకు కూతురుతో సమానమని, ఆమెను గెలిపించడం తన బాధ్యత అని చెప్పారు. ఎన్నికల బరిలో ఎవరున్నా గెలిపించడం తమ బాధ్యత అని చెప్పారు. 
 
పైగా, తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తానని ఎన్నడూ చెప్పలేదని, అందువల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అభ్యర్థి విషయంలో పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడివుంటానని తెలిపారు. 
 
అంతేకాకుండా, తన తండ్రి ఆశయాలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతోనే సుహాసిని రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెకు ఎలాంటి స్వార్థం లేదని, కేవలం ప్రజాసేవ చేయాలన్న బలమైన ఆకాంక్ష మాత్రమే ఉందన్నారు. కొత్తవాళ్ళకు కూడా అవకాశం కల్పించే చర్యలో భాగంగా సుహాసినికి టిక్కెట్ ఇచ్చినట్టు పెద్దరెడ్డి వివరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments