Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో అందరూ శాకాహారులుగా మారాలనుకుంటున్నారా? సుప్రీం ప్రశ్న

మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ.. దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (10:27 IST)
మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ.. దాఖలైన పిల్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అంతేగాకుండా దేశంలోని అందరూ శాకాహారులుగా మారాలని కోరుకుంటున్నారా? అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది.
 
కాగా, బుధవారం హిందూత్వ సంస్థలకు చెందిన పలువురు యువకులు ఢిల్లీ వీధుల్లో హల్ చల్ చేశారు. మాంసం దుకాణాలు మూసెయ్యాలంటూ హడావిడి చేశారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేవరకు మాంసం దుకాణాలు తెరిస్తే షాపులు ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. 
 
పాలెం విహార్, సూరత్ నగర్, అశోక్ విహార్, సెక్టార్ 5, 9, పటౌడీ చౌక్, జాకోబ్‌పురా, సదర్ బజార్, ఖద్సా అనాజ్ మండి, బస్టాండ్, డీఎల్ఎఫ్ ప్రాంతం, సోహ్నా, సెక్టార్ 14 సహా పలు చోట్ల షాపులు బలవంతంగా మూసివేయించినట్టు తెలుస్తోంది. కొందరు మాంసం వ్యాపారులు మాట్లాడుతూ, శివసేన కార్యకర్తలు తమ షాపులను బలవంతంగా మూయించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాంసాహార నిషేధంపై వేసిన పిల్‌పై సుప్రీం పై విధంగా  స్పందించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments