Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రియాన్ లారా వంటి వారే ఏమీ చేయలేకపోయారు.. మేం ఎంత మాత్రం?

విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌ (40) ఫిట్‌గా ఉంటే 2019లో జరిగే వరల్డ్‌క్‌పలో కచ్చితంగా ఆడతాడని జట్టు సారథి జాసన్‌ హోల్డర్‌ తెలిపాడు. గేల్‌తో పాటు మార్లోన్‌ శామ్యూల్స్‌ కూడా మెగా టోర్నీలో ఆడే అవ

Advertiesment
India
, గురువారం, 11 అక్టోబరు 2018 (12:09 IST)
విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్‌ (40) ఫిట్‌గా ఉంటే 2019లో జరిగే వరల్డ్‌క్‌పలో కచ్చితంగా ఆడతాడని జట్టు సారథి జాసన్‌ హోల్డర్‌ తెలిపాడు. గేల్‌తో పాటు మార్లోన్‌ శామ్యూల్స్‌ కూడా మెగా టోర్నీలో ఆడే అవకాశముందని హోల్డర్‌ చెప్పాడు. అలాగే భారత్‌ చేతిలో తొలి టెస్టులో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌‌పై మాజీ క్రికెటర్లు చేస్తున్న విమర్శలను హోల్డర్ తిప్పికొట్టాడు. 
 
బ్రియాన్‌ లారా వంటి దిగ్గజాలతో కూడిన జట్టే 1994లో భారత్‌తో ఆడిన టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయిందని గుర్తు చేశారు. ఇంకా అప్పట్లో డ్రాతో సరిపుచ్చుకుందని హోల్డర్ గుర్తు చేశారు. ఆ జట్టుతో పోల్చుకుంటే ప్రస్తుత కరేబియన్ జట్టుకున్న అనుభవం చాలా తక్కువంటూ వ్యాఖ్యానించాడు. 
 
అయినప్పటికీ తాము ఆడిన చివరి ఐదు టెస్టు సిరీస్‌లలో పెద్ద జట్లపై కూడా నెగ్గామన్నాడు. మాజీలు విమర్శిస్తున్నట్టుగా విండీస్‌ టెస్టు జట్టు మరీ బలహీనంగా ఏమి లేదని హోల్డర్‌ తెలిపాడు. 
 
ఇదిలా ఉంటే.. భారత్‌ -విండీస్ టెస్టు మ్యాచ్‌కు ఉప్పల్‌ సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్ల క్రికెటర్లు హైదరబాద్‌ చేరుకున్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు జరగనున్న మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
మరోవైపు అంతర్జాతీయ క్రికెటర్లు నగరానికి చేరిన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఉప్పల్‌లో టీమిండియా ట్రాక్‌ రికార్డు చూస్తే.. విండీస్‌‌ విలవిలలాడం ఖాయమంటున్నారు క్రికెట్‌ అభిమానులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ క్రీడాకారుడూ లైంగికంగా వేధించాడు : జ్వాలా గుత్తా