Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తండ్రి పేరు కాదు.. మీ తండ్రుల పేరు పెట్టుకోండి.. రెబెల్స్‌కు సీఎం ఉద్ధవ్

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (18:07 IST)
తనపై తిరుగుబాటు చేసిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వినియోగించడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి గౌహతిలో క్యాంపు శిబిరంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శనివారం కొత్త పార్టీని స్థాపించారు. దీనికి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టుకున్నారు. 
 
దీనిపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వాడరాదన్నారు. మీ తండ్రుల పేరుతో పార్టీని స్థాపించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ తండ్రు పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని ఆయన సవాల్ విసురుతూ బాల్‌ ఠాక్రే పేరును వాడొద్దని హెచ్చరించారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు శివసేన జాతీయ కార్యవర్గం శనివారం మరోమారు సమావేశమైంది. ఇందులో పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments