Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్?

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:45 IST)
జాతీయ స్థాయిలో మంచి ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రశాంత్ కిశోర్ చేరికకు సంబంధించి పలువురు సీనియర్ నేతలు ఇప్పటికే అధినేత్రి సోనియాగాంధీతో చర్చించారని, త్వరలోనే ఆమె తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 
అయితే, ప్రశాంత్ కిశోర్ చేరికను కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, మరికొందరు మాత్రం ఆయన చేరికను ఆహ్వానిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లోకి వస్తే మేలే జరుగుతుందంటున్నారు. 
 
అయితే, పార్టీ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది పీకే రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పీకేను పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అన్న విషయంలో త్వరలోనే సోనియాగాంధీ ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
 
కాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీఎస్‌లో చేరారు. ఆ తర్వాత అక్కడ ఇమడలేక పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీలు అధికారంలోకి రావడంలో కీలక పాత్రను పోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments