Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్ వారసురాలివి నీవే సుప్రియా : డిగ్గీరాజా

Webdunia
ఆదివారం, 24 నవంబరు 2019 (15:34 IST)
మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠా యోధుడుగా గుర్తింపు పొందిన నేత శరద్ పవార్. ఇంతకాలం ఈయన వారసుడు ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ అని ప్రతి ఒక్కరూ భావిస్తూ వచ్చారు. కానీ, ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల ఇపుడు ఆయన ఏకాకి అయ్యారు. 
 
ఎన్సీపీని చీల్సి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కలలుగన్నాడు. దీంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రిపదవిని బీజేపీ ఆఫర్ చేసింది. ఈ ఆఫర్‌తో ఉబ్బితబ్బిబ్బులైన అజిత్ పవరా తెల్లారేసరికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 
 
ఎన్సీపీని మోసం చేస్తూ అజిత్ పవార్ సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే అజిత్ పవార్‌పై ఆ పార్టీ అధిష్టానం వేటువేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక శరద్ పవార్ రాజకీయ వారసురాలు ఆయన కూతురు సుప్రియా సూలెనే అంటూ ట్వీట్ చేశారు.
 
'ఎన్సీపీ నుంచి గెలిచిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు 53 మంది శరద్ పవార్ వెంటే ఉన్నారు. అజిత్ పవార్ ఒంటరి అయ్యారు. ఇప్పుడు శరద్ పవార్ వారసురాలివి నువ్వే సుప్రియ సూలె' అంటూ దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments