Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ శవాన్ని భుజంపై వేసుకుని మోసుకుంటూ వెళ్లిన తల్లి...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (10:59 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పాషాణ హృదయులుగా మారిపోయారు. ఆంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకుసైతం ఆంబులెన్స్ ఇవ్వలేదు. దీంతో బిడ్డ శవాన్ని భుజం వేసుకుని మోసుకుంటూ వెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాహజాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ... తీవ్ర జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. ఆ బాలుడుని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని ఇతర ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, తమ దగ్గర చిల్లి గవ్వలేకపోవడంతో అంబులెన్స్‌ ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బందిని కాళ్లవేలా ప్రాధేయపడింది. కానీ, వైద్యులు మాత్రం నిరాకరించారు. 
 
దీంతో చేసేదేంలేక తన కొడుకును భుజాలపై వేసుకుని నడక సాగించామన్నారు. 'నా భుజాలపై ఉన్న నా బిడ్డ మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రివారు అంబులెన్స్‌ ఇచ్చి ఉంటే తన కొడుకు బతికేవాడని' అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆసుపత్రి ముందు మూడు అంబులెన్స్‌లు పార్క్‌ చేసి ఉన్నాయని, అయినా తమకు ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదన్నారు. అయితే ఆ దంపతుల ఆరోపణలను ఆస్పత్రి వైద్యులు తోసిపుచ్చారు. ఆ మహిళ అసత్య అరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments