Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం సొమ్ముతో ఇల్లు కట్టారా? జర్నలిస్టును ఎత్తి నేలపై పడేశారు...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (10:38 IST)
అవినీతి సొమ్ముతో ఇల్లు కట్టారా అని ప్రశ్నించిన ఓ జర్నలిస్టుకు తగినశాస్తి జరిగింది. నన్ను అవినీతిపరుడు అంటావా అంటూ ఆగ్రహించిన ఆ ప్రభుత్వ అధికారి ఆ జర్నలిస్టును పట్టుకుని ఎత్తి నేలపై పడేశాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ జర్నలిస్టు బిక్కమొహం వేశాడు. ఈ ఘటన రష్యాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రష్యాలోని సైబీరియా జిల్లా ముఖ్య అధికారి సెర్జీ జైత్సేవ్ (52)తో ముఖాముఖి ఇంటర్వ్యూ కోసం ఇవాన్ లిటోమిన్ అనే జర్నలిస్టు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. యువకుడైన ఇటోమిన్ అడిగిన ప్రశ్నలు జైత్సేవ్‌ను పదేపదే ఇరకాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా, 2015లో రష్యాలో కార్చిచ్చు చెలరేగగా, నష్టపరిహారం సొమ్మును అధికారులు దిగమింగినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 
 
ఇదే అంశంపై ఆ అధికారిని జర్నలిస్టు పదేపదే గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించారు. దీంతో నిగ్రహం కోల్పోయాడు. అయినప్పటికీ ఆ విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చాడు. చివరకు అవినీతి సొమ్ముతో మీరు రాజసౌధంలాంటి భవనం నిర్మించారా? అని లిటోమిన్ అడగడంతో జైత్సేవ్‌లో కోపం కట్టలు తెంచుకుంది. 
 
ఒక్కసారిగా ముందుకు ఉరికి ఆ యువ జర్నలిస్టును దొరకబుచ్చుకుని ఎత్తి నేలపై కుదేశాడు. ఊహించని హఠాత్పరిణామానికి ఆ పాత్రికేయుడు బిక్కచచ్చిపోయాడు. అక్కడున్న వారు వెంటనే కలుగజేసుకుని లిటోమిన్‌ను బయటికి తీసుకువచ్చారు. ఈ ఘటన రష్యాలో అధికారవర్గాల్లో నెలకొన్న అవినీతికి నిదర్శనం అని అక్కడి మీడియా ఎలుగెత్తి ఘోషిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments