Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నటనకు గుడ్‌బై చెప్పిన టాలీవుడ్ బ్యూటీ?

నటనకు గుడ్‌బై చెప్పిన టాలీవుడ్ బ్యూటీ?
, మంగళవారం, 21 మే 2019 (18:07 IST)
సినీ పరిశ్రమలో హీరోయిన్‌ల కెరీర్ కొంతకాలం మాత్రమే ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతుంటారు. ఇక అవకాశాలు వచ్చినన్ని రోజులు మాత్రం పెళ్లి వంటి పర్సనల్ విషయాలను పక్కన పెట్టి మరీ నటిస్తుంటారు. అలాంటిది 30 ఏళ్లకే టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి నటన నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 
 
14 ఏళ్ల వ‌య‌సులోనే "నా తోడు కావాలి" అనే సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ సుమారుగా 50 సినిమాల వరకు నటించింది. చివరిగా ఆమె జ్యోతిలక్ష్మి అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా వచ్చి సుమారు నాలుగేళ్లు దాటుతోంది.
 
ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ నెలకొల్పిన ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇక పూర్తి స్థాయిలో నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఆమెను ఓ తమిళ ఛానెల్ వారు.. ఏంటి సినిమాలు చేయ‌డం లేద‌ని అడిగితే.. ఇంకా ఎన్నిరోజులు హీరోయిన్‌గానే నటిస్తూ ఉంటాను.. వేరే కూడా చూసుకోవాలి క‌దా అంటూ స‌మాధానం ఇవ్వడంతో పాటుగా ఇప్ప‌టికీ ఎవ‌రో ఒక‌రు త‌నను సినిమాల్లో న‌టించ‌మ‌ని అడుగుతూనే ఉన్నా తానే వ‌ద్ద‌ని వారిస్తున్న‌ట్లు స్పష్టం చేసింది ఛార్మి. ప్ర‌స్తుతం రామ్ హీరోగా న‌టిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమాకు ఛార్మి స‌హనిర్మాత‌గా వ్యవహరిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలిపై టాలీవుడ్ మన్మథుడి క్రేజీ ట్వీట్