Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై నేనే చూసుకుంటా... తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ శపథం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (10:23 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ శపథం చేశారు. అదీ కూడా హైదరాబాద్‌లోని తన తాత స్వర్గీయ ఎన్.టి.రామారావు సమాధి సాక్షిగా ఆయన ఈ ప్రతిజ్ఞ చేశారు. అదేంటంటే.. ఇకపై ప్రతి యేడాది ఎన్టీఆర్ జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని చెప్పారు.
 
ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించేందుకు తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చారు. 
 
నిజానికి ఎన్టీఆర్ జయంతి లేదా వర్థంతి రోజుల్లో సమాధి మొత్తం వివిధ రకాల పూలతో ఎంతో అందంగా సుందరీకరిస్తారు. కానీ, మంగళవారం సమాధి వద్దకు హీరోలు వచ్చేసరికి సమాధిపై ఒక్కకంటే ఒక్క పువ్వు కూడా లేదు. దీన్ని చూసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు తీవ్ర అసహనానికి గురయ్యారు. 
 
ఆ తర్వాత పూలను తానే తెప్పించి, తన ఫ్యాన్స్ సహాయంతో సమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత పుష్పగుచ్చాలతో తారక్, కల్యాణ్‌రామ్ నివాళులు అర్పించారు. తాత సమాధి పక్కనే కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఇక నుంచి తాత వర్ధంతి, జయంతి వేడుకల ఏర్పాట్లను తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించి జూనియర్ ఎన్టీయార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments