Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తలేడు.. వేరొక వ్యక్తి ఇష్టమన్నాడు.. నో చెప్పడంతో సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:47 IST)
భర్త చనిపోవడంతో ఆమె తన కూతురితో ఒంటరి జీవనం గడుపుతోంది. అయితే ఆమె ఇంటి పక్కనే వున్న వ్యక్తి ఆమెను ఇష్టపడ్డాడు. కానీ అందుకు ఒప్పుకోలేదు. ఆ యువకుడు గత ఏడాది నవంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
 
దీనిపై ఆగ్రహం చెందిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగారు. ముగ్గురు బహిరంగంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ దుర్ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. విహార్ కస్తూర్బా నగర్‌లో గణతంత్ర దినోత్సవం రోజునే ఈ దారుణం జరిగింది.  
 
బాధితురాలి చెల్లెలి ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.  ఆ వీడియోను చూసిన ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. 
 
ఈ వీడియోలో సామూహిక అత్యాచారం తర్వాత బాధితురాలికి నిందితులు శిరోముండనం చేశారు.. చితకబాదారు.. మొహానికి నల్ల రంగు పూసి.. మెడలో చెప్పులదండ వేసి వీధులన్నీ తిప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం