Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలను వేటకొడవళ్లతో నరికేసిన బీజేపీ నేతలు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:45 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు జరిగాయి. వైకాపాకు చెందిన ఇద్దరు నేతలను భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు చంపేశారు. వేటకొడవళ్ళతో వేటాడి మరీ హత్య చేశారు. ఈ జంట హత్యలు జిల్లాలోని కౌతల మండలం కామవరం అనే గ్రామంలో జరిగాయి. 
 
వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నలతో బీజేపీకి చెందిన మల్లిఖార్జునకు ఓ భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైకాపాలో, మల్లిఖార్జున వర్గం బీజేపీలో ఉన్నారు. అయితే, భూగొడవ విషయంలో మాట్లాడేందుకు గురువారం ఉదయం ఇరు వర్గాలు సమావేశమయ్యాయి. 
 
ఈ సమావేశం కాస్త రసాభాసగా మారింది. చివరకు ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మల్లిఖార్జున వర్గం నేతలు శివప్ప, ఈరన్నలపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కామవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments