Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు మిస్సయింది.. కారు ఎక్కింది... ముగ్గురు కామాంధుల చేతిలో నలిగిపోయింది...

ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:36 IST)
ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆ యవతి ఈనెల 18వ తేదీన పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో స్కూలు బస్సు మిస్సైంది. దాంతో ఆ బాలిక ఇంటికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు అబ్బాయిలు.. తనను ఇంటి వద్ద దించుతామని నమ్మించడంతో ఆ బాలిక కారు ఎక్కింది.
 
కొద్దిదూరం వెళ్లాక ఆ బాలిక నోట్లో బట్టలు కుక్కి, ఆ తర్వాత రేప్‌కు ప్రయత్నించారు. ఓ మత్తు పానీయాన్ని కూడా ఆమెకు తాగించారు. తమ కూతురు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో నాలెడ్జ్ పార్క్ ఏరియాలో మత్తులో ఆ యువతిని గుర్తించారు. హాస్పటల్‌కు తీసుకువెళ్లి వైద్యం చేయగా, ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments