Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం: హస్తినలో హై అలర్ట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:37 IST)
దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్ని జరుపుకోబోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి 55 పిస్తోళ్లు, 50 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్నించి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ క్యాట్రిడ్ద్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేడుకల సమీపించడం, భారీ ఉగ్రకుట్ర భగ్నం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ఎర్రకోట వద్ద 5 వేలమంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతంలో ఎత్తైన భవనాలపై ఎస్ఎస్‌జీ, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహారా కాస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ద్రోన్లు, బెలూన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థ ఏర్పాటైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments