Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం: హస్తినలో హై అలర్ట్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (14:37 IST)
దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్ని జరుపుకోబోతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ పతాకం రెపరెపలాడనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. పంద్రాగస్టు నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి 55 పిస్తోళ్లు, 50 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల్నించి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ క్యాట్రిడ్ద్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంద్రాగస్టు వేడుకల సమీపించడం, భారీ ఉగ్రకుట్ర భగ్నం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 
 
ఎర్రకోట వద్ద 5 వేలమంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతంలో ఎత్తైన భవనాలపై ఎస్ఎస్‌జీ, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహారా కాస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ద్రోన్లు, బెలూన్లు ఎగురవేయడాన్ని నిషేధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థ ఏర్పాటైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments