Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ కీచకుడు : మహిళా కానిస్టేబుల్స్ కళ్లెదుటే మహిళా ఖైదీపై రైలు బాత్రూమ్‌లో రేప్...

Webdunia
గురువారం, 8 ఆగస్టు 2019 (10:58 IST)
ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కీచకుడిగా మారిపోయాడు. పక్కనే ఇద్దరు సహచర మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయాడు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు పక్కనే ఉన్నప్పటికీ ఓ మహిళా ఖైదీపై రైలు బాత్రూంలో అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 42 యేళ్ళ మహిళ ఓ కేసులో అరెస్టు అయి ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. అయితే ఆమెను ముర్షీదాబాద్ కోర్టు (బెంగాల్ రాష్ట్రం)లో పరిచేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళతో పాటు ఓ పురుష కానిస్టేబుల్ బందోబస్తుగా నియమించారు. 
 
దీంతో ఆ మహిళా ఖైదీని గట్టిబందోబస్తు మధ్య ముర్షీదాబాద్ కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి రైలులో బయలుదేరారు. ఈ క్రమంలో ఆ మహిళా ఖైదీపై కన్నేసిన కానిస్టేబుల్ ఆమె బాత్రూముకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందిని వెనక్కి పంపి అతడు టాయిలెట్‌లో జొరబడి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జైలుకు వెళ్లాక కానిస్టేబుల్ అఘాయిత్యాన్ని బాధితురాలు జైలు సూపరింటెండెంట్‌కు, జైలు వైద్యుడికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments