Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కానిస్టేబుల్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ఓ కానిస్టేబుల్ అత్యంత కిరాతకంగా నడుచుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ గొడ్డలితో నరికి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖర్‌ఖైదా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ బిజేంద్ర సింగ్ వెల్లడిస్తూ,  కానిస్టేబుల్ దీపక్(39) అతని ఇంటిలోని ఒక గదిలో అచేతనస్థితిలో కనిపించాడని, అలాగే అతని తల్లిదండ్రుల మృతదేహాలు కూడా అక్కడే లభ్యమయ్యాయని తెలిపారు. 
 
వారి వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చని, వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైంది. దానిపై రక్తం మరకలు ఉన్నాయని తెలిపారు. 
 
దీపక్ తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన తరువాత వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తర్వాత తాను విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments