Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కానిస్టేబుల్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:48 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ఓ కానిస్టేబుల్ అత్యంత కిరాతకంగా నడుచుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ గొడ్డలితో నరికి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖర్‌ఖైదా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ బిజేంద్ర సింగ్ వెల్లడిస్తూ,  కానిస్టేబుల్ దీపక్(39) అతని ఇంటిలోని ఒక గదిలో అచేతనస్థితిలో కనిపించాడని, అలాగే అతని తల్లిదండ్రుల మృతదేహాలు కూడా అక్కడే లభ్యమయ్యాయని తెలిపారు. 
 
వారి వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చని, వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైంది. దానిపై రక్తం మరకలు ఉన్నాయని తెలిపారు. 
 
దీపక్ తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన తరువాత వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తర్వాత తాను విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments