Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ బాలుడిని ఓ దుర్మార్గుడు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (10:11 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడనీ ఆరేళ్ళ బాలుడిని ఓ దుర్మార్గుడు అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ పరిధిలోని ఓఖ్లా ఫేజ్ 2లో రోహిత్ అనే వ్యక్తి తన భార్యతో కలసి నివశిస్తున్నాడు. రోహిత్ భార్య స్నానం చేస్తుండగా ఆరేళ్ళ బాలుడు చూశాడు. దీంతో ఆగ్రహంచిన రోహిత్ ఆ బాలుడిని హత్య చేశాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని బాక్స్ బెడ్‌లో భద్రపరిచాడు. పిమ్మట రోహిత్ పరారై, సెల్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నాడు. 
 
అయితే, తమ బిడ్డ కనిపించడం లేదనీ బాలుడి తల్లిదండ్రులు గత నెల 27వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... రోహిత్‌పై అనుమానంతో నిఘా పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించారు. 
 
ఈ విచారణలో తన భార్య స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడని, ఆపై పిచ్చి మాటలు మాట్లాడాడన్న ఆగ్రహంతో అతన్ని చంపేసినట్టు రోహిత్ విచారణలో అంగీకరించాడు. దీంతో అతనిపై హత్యా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments