Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

యాసిడ్‌ను కూల్‌డ్రింక్స్ అనుకుని తాగేసిన చిన్నారులు.. పుట్టినరోజు వేడుకలో విషాదం

యాసిడ్‌ను కూల్ డ్రింక్‌గా భావించి తాగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు ముగిసి నిమిషాలు కాకముందే ఓ చిన్నారి.. అతడి స్నేహితుడైన బాలుడు.. కూల్‌డ్రింక్స్

Advertiesment
Two boys
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (08:37 IST)
యాసిడ్‌ను కూల్ డ్రింక్‌గా భావించి తాగిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు ముగిసి నిమిషాలు కాకముందే ఓ చిన్నారి.. అతడి స్నేహితుడైన బాలుడు.. కూల్‌డ్రింక్స్ అనుకుని యాసిడ్ తాగేశారు. క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, కెంపెగౌడ రోడ్డులో నివాసముంటే స్వర్ణకారుడైన శంకర్ కుమారుడు సాహిల్ శంకర్. ఇతడికి పుట్టిన రోజును ఘనంగా జరపాలని నిర్ణయించిన ఆయన స్నేహితులు, బంధువులను ఆహ్వానించాడు. కేట్ కట్ చేసి వేడుక ముగిసిన తర్వాత డిన్నర్‌కు సిద్ధమయ్యారు. 
 
అయితే సాహిల్, అతడి స్నేహితుడు ఆర్యన్ ఓ గదిలోకి వెళ్లారు. అక్కడ ఓ గాజు సీసాలో నిల్వ చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను చూసిన వారు దానిని కూల్ డ్రింక్‌గా భావించి తాగేశారు. వెంటనే కుప్పకూలిపోయారు. యాసిడ్ తాగిన చిన్నారులను ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
దీంతో పుట్టిన రోజు వేడుకలు జరిగిన ఇంట విషాదం నెలకొంది. సాహిల్ మూడో తరగతి చదువుతుండగా, ఆర్యన్ రెండో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడ నగరాన్ని ఉర్రూతలూగిస్తున్న దాండియా నృత్యం