చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామా

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులను చంపేయాలని.. వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మాలివల్ కోరారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా నెల రోజులపాటు సత్యాగ్రహం చేయనున్నట్టు స్వాతి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఎనిమిది నెలల చిన్నారిపై ఢిల్లీలో జరిగిన అకృత్యం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ప్రధానికి లేఖ రాసిన స్వాతి..చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని.. అలాంటి విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
 
కామాంధుడి అఘాయిత్యానికి గురైన చిన్నారి ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోందని.. ప్రధాని దృష్టి అటు వైపు మళ్లించేందుకే ఈ లేఖను రాసినట్లు స్వాతి పేర్కొన్నారు. ఇంతకుముందు రెండేళ్లుగా ప్రధాని మోదీకి రాసిన లేఖల్లో ఒక్కదానికీ సమాధానం లేదని విమర్శించారు. మహిళలు అందరికీ మీరే దిక్కు.. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మోదీపై వుందని లేఖలో స్వాతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments