Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి యత్నించాడు.. అంతే... బాలుడిని కొట్టి చంపేశారు..

సోషల్ మీడియా ప్రభావంతో అమాయకులు బలైపోతున్నారు. వాట్సాప్‌లో వచ్చే వార్తల వల్ల జనాలు ఎదుటి వ్యక్తులను నమ్మకుండా వారిపై దాడి చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుక

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో అమాయకులు బలైపోతున్నారు. వాట్సాప్‌లో వచ్చే వార్తల వల్ల జనాలు ఎదుటి వ్యక్తులను నమ్మకుండా వారిపై దాడి చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తూ దొరికిన ఓ పిల్లాడిని (16) కట్టేసి చావగొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక ఆ బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ముకుంద్ పూర్లో ఉంటున్న ఓ బాలుడు మరో ఇద్దరితో కలసి మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరీచేసేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా ఈ ఇంట్లో ఉన్నవారు ఈ పిల్లాడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఇది తెలుసుకుని అక్కడకు చేరుకున్న స్థానికులు రాత్రంతా ఈ బాలుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అనంతరం ఉదయాన్నే రోడ్డుపై పడేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి బంధువులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన వారిని పోలీసులకు అప్పగించాల్సిందిపోయి ఇలా దాడి చేయడం ఏమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments