Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఢిల్లీ వాయు కాలుష్యం చంపేస్తుంది, ఇంకెందుకు ఉరి? సుప్రీంలో నిర్భయ దోషి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (18:59 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఎన్ కౌంటర్‌లో చచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ నిర్భయ కేసులో దోషులను ఇన్ని రోజుల పాటు జైల్లో జీవిస్తూ వుండటంపై దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనితో వారిని ఉరి తీయడం ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. డిసెంబరు 16వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపధ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడు సుప్రీంకోర్టుకు ఓ పిటీషన్ పెట్టుకున్నాడు. ఢిల్లీలోని గాలి పీలిస్తేనే చనిపోవడం ఖాయమనీ, ఢిల్లీ వాయు కాలుష్యానికి తమ ఆయుష్షు తగ్గిపోతుంది కనుక తమను ఉరి తీసే బదులు ఢిల్లీలో వదిలేస్తే ఆ గాలి పీల్చే చచ్చిపోతామనీ, కనుక తమను ఉరి తీయకుండా వదిలేయాలంటూ అతడు సుప్రీంకోర్టును వేడుకున్నాడు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ఈమేరకు పిటీషన్ పెట్టుకున్నాడు. 
 
ఇదిలావుంటే  నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను ఈ నెల డిసెంబర్ 16న ఉరి వేయబోతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే 14వ తేదీ లోగా ఉరి తాళ్లను సిద్ధం చేయాలంటూ బీహారులోని బక్సర్ జైలుకు ప్రిజన్ డైరెక్టరేట్ ఆదేశాలివ్వడంతో నిర్భయ దోషుల ఉరి ఖాయమనే అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరుణాద చక్రవర్తి నిమ్మశివన్న కి పెద్ది చిత్ర బృందం అభినందనలు

అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా సైయారా టీజర్‌ విడుదల

చంద్రబాబు ఆవిష్కరించిన ధర్మచక్రం సినిమా ఆడియో విడుదల

మహేష్ ఖలేజా రీ-రిలీజ్: థియేటర్‌లో పిల్ల పామును చేతితో పట్టుకుని అభిమాని రచ్చ (video)

Shashti purthi : రాజేంద్రప్రసాద్ నటించిన షష్టి పూర్తి మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments