Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ఢిల్లీ వాయు కాలుష్యం చంపేస్తుంది, ఇంకెందుకు ఉరి? సుప్రీంలో నిర్భయ దోషి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (18:59 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఎన్ కౌంటర్‌లో చచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ నిర్భయ కేసులో దోషులను ఇన్ని రోజుల పాటు జైల్లో జీవిస్తూ వుండటంపై దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనితో వారిని ఉరి తీయడం ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. డిసెంబరు 16వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపధ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడు సుప్రీంకోర్టుకు ఓ పిటీషన్ పెట్టుకున్నాడు. ఢిల్లీలోని గాలి పీలిస్తేనే చనిపోవడం ఖాయమనీ, ఢిల్లీ వాయు కాలుష్యానికి తమ ఆయుష్షు తగ్గిపోతుంది కనుక తమను ఉరి తీసే బదులు ఢిల్లీలో వదిలేస్తే ఆ గాలి పీల్చే చచ్చిపోతామనీ, కనుక తమను ఉరి తీయకుండా వదిలేయాలంటూ అతడు సుప్రీంకోర్టును వేడుకున్నాడు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ఈమేరకు పిటీషన్ పెట్టుకున్నాడు. 
 
ఇదిలావుంటే  నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను ఈ నెల డిసెంబర్ 16న ఉరి వేయబోతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే 14వ తేదీ లోగా ఉరి తాళ్లను సిద్ధం చేయాలంటూ బీహారులోని బక్సర్ జైలుకు ప్రిజన్ డైరెక్టరేట్ ఆదేశాలివ్వడంతో నిర్భయ దోషుల ఉరి ఖాయమనే అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments