Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢంగా ప్రేమించింది, పెళ్ళి సమయానికి మరో ప్రేమికుడితో జంప్...

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:17 IST)
నాలుగేళ్ళు ప్రేమించిన ప్రియుడిని వివాహం చేసుకోవాల్సిన వధువు ఆఖరి క్షణంలో మరో ప్రియుడితో వెళ్ళిపోవడంతో బంధువులు, స్నేహితులు నిశ్చేష్టులయ్యారు. చెన్నై నగరంలోని నుంగంబాక్కంకు చెందిన 23 యేళ్ళ పెరియమ్మాళ్ ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.
 
అదే సంస్థలో పనిచేస్తున్న నెమిలిచేరికి చెందిన సెంథిల్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. దీంతో వీరి ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వివాహానికి ప్లాన్ చేశారు. కళ్యాణ మండపం బుక్ చేశారు. నిన్న సాయంత్రం వివాహం జరగాల్సి ఉంది. బంధువులతో హడావిడిగా మారిపోయింది మండపం.
 
ఉదయం 5 గంటలకే ముహూర్తం. అందరూ నిద్రించే సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు వధువు వేరొక యువకుడితో పారిపోయింది. వరుడు అంతా వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి సిసి ఫుటేజ్‌లను పరిశీలిస్తే పెళ్ళి బట్టలతోనే యువకుడితో యువతి పారిపోయినట్లు గుర్తించారు.
 
సెంథిల్ కుమార్‌తో పాటు మరొక యువకుడితోను ఈమె ప్రేమాయణం సాగించినట్లు ఆమె స్నేహితులు తరువాత చెప్పారు. పారిపోయిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments