Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:16 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి... తొలి విడత ఎన్నికలు ముగియడంతో.. రెండో విడతకు సిద్ధమవుతోంది ఎస్‌ఈసీ.. అయితే, పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే.. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
 
కాగా, గతంలో 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు స్వీకరణ ప్రక్రియతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంలో ఎన్నికలు వాయిదా వేసింది ఎస్‌ఈసీ.. అయితే, అదే ప్రక్రియ తిరిగి ఎస్‌ఈసీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తిరిగి ప్రారంభిస్తారా? కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments