Webdunia - Bharat's app for daily news and videos

Install App

16వ బిడ్డకు జన్మనిస్తూ ప్రాణాలు వదిలిన మహిళ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (12:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ ప్రాణాలు వదిలింది. ఆమె వయసు 45 యేళ్లు. ఈ బడ్డకు జన్మినిచ్చే సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆమె మరణించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్‌వర్‌ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్‌ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి.
 
పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు భార్య పలుమార్లు ప్రయత్నించింది. కానీ, భర్త అంగీకరించలేదు. దీంతో ఆ ఇల్లాలు జీవితమంతా పిల్లలుకంటూనే వచ్చింది. చివరకు తన 16వ బిడ్డకు జన్మనిస్తు ప్రాణాలు వదిలింది. 
 
దీనిపై మృతురాలి బిడ్డల్లో ఓ కుమార్తె స్పందిస్తూ, 'నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్‌ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్‌ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను. 
 
కానీ అమ్మ వినలేదు. వారం రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో అధిక రక్తస్రావం కావడంతో మరణించింది' అని సవిత తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments