Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి అయ్యాక కూడా బలాత్కారం... భరించలేక చంపేసిన మహిళ...!

పెళ్లి అయ్యాక కూడా బలాత్కారం... భరించలేక చంపేసిన మహిళ...!
, ఆదివారం, 18 అక్టోబరు 2020 (16:20 IST)
చిన్న వయసులో అత్యాచారానికి తెగబడిన ఓ కామాంధుడు పెళ్లి అయిన తర్వాత కూడా వేధించసాగాడు. అతని వేధింపులు భరించలేని ఓ మహిళ చివరకు అతన్ని హతమార్చింది. ఆ తర్వాత నేరుగా ఠాణాకు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భోపాల్ నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని గుణ జిల్లా అశోక్ నగర్ నివాసి బ్రిజ్ భూషణ్ శర్మ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. నిజానికి ఆ మహిళ వయసు 16 యేళ్లుగా ఉన్నడు తొలిసారి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతనికి వివాహమైన తర్వాత కూడా ఆమెను బెదిరిస్తూ బలాత్కారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
తన భర్త  వేరే జిల్లాలో పనిచేయడానికి వెళ్లగా మద్యం మత్తులో ఉన్న శర్మ తన ఇంటికి వచ్చి తనపై అత్యాచార యత్నం చేయబోగా అతన్ని వంటగదిలోని కత్తితో పొడిచి చంపానని బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. తాను 16 ఏళ్ల వయసులో ఉండగా 2005వ సంవత్సరంలో తన పొరుగింటి వ్యక్తి అయిన శర్మ తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీసి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ గత 15 ఏళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని మహిళ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని నెన్నెలలో ఓ యువకుడు ఘాతుకానికి పూనుకున్నాడు. వృద్ధురాలిపై మూడు రోజులుగా యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడి ఘాతుకాన్ని భరించలేని బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జరిగిన ఘోరంపై పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ గెలుస్తానంటున్న ట్రంప్ - బైడెన్ వైపు భారతీయుల మొగ్గు!