Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్ర తుపానుగా షహీన్.. 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది..

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (09:59 IST)
అరేబియా సముద్రం మధ్యలో ఏర్పడిన షహీన్‌ తుపాను తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ విభాగం (ఐఎండి) శుక్రవారం పేర్కొంది. అంతకు ముందు ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది.

సాయంత్రం 5.30 గంటల సమయానికి అరేబియా సముద్రం వాయువ్య, ఈశాన్య ప్రాంతం మధ్య కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. తదుపరి 12 గంటల్లో తుపాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, 36 గంటల్లో మాక్రాన్‌ తీరం వెంబడి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, ఆ తరువాత పశ్చిమ-నైరుతి వైపుగా తిరుగుతుందని తెలిపింది. 
 
అనంతరం ఒమన్‌ తీరం వైపుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండి వెల్లడించింది. గులాబ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరం దాటిన వారం రోజుల తర్వాత ఈ షహీన్‌ తుపాను భారతదేశ తీరానికి దూరంగా వెళుతోంది. మత్స్యకారులు శనివారం వరకు ఆరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది. 
 
ఇప్పటికే వెళ్లిన వారెవరైనా ఉంటే వెంటనే వెనక్కు వచ్చేయాలని సూచించింది. షహీన్‌ ప్రభావంతో ఆదివారం వరకు గుజరాత్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments