నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. విదేశాల్లో సోనియా ఫ్యామిలీ..

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:29 IST)
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక మండలి అని కాంగ్రెస్ వర్కింట్ కమిటి సమావేశం ఆదివారం జరుగనుంది. ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీలు వర్చువల్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకలు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వైద్య పరీక్షల కోసం సోనియా వెళ్లగా ఆమెకు తోడుగా రాహుల్, ప్రియాంకలు వెళ్లారు. దీంతో వారు ఈ వర్కింగ్ కమిటీ సమావేశానికి వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఇందులో భవిష్యత్‌లో జరుగనున్న ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. 
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా పార్టీలో నమ్మకబంటుగా ఉంటూ వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అనేక సంచలనం ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మిగిలిన  నేతలు సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించే అవకాశం వుంది. మరోవైపు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ జోడో యాత్రను నిర్వహించనుంది. ఇందుకోసం రాష్ట్రాల వారీగా సమన్వయకర్తలను నియమించనుంది. వీరిలో ఏపీకి ఎస్వీ రమణ, తెంలగాణకు డాలీశర్మలు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments