Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. విదేశాల్లో సోనియా ఫ్యామిలీ..

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (10:29 IST)
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక మండలి అని కాంగ్రెస్ వర్కింట్ కమిటి సమావేశం ఆదివారం జరుగనుంది. ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీలు వర్చువల్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకలు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వైద్య పరీక్షల కోసం సోనియా వెళ్లగా ఆమెకు తోడుగా రాహుల్, ప్రియాంకలు వెళ్లారు. దీంతో వారు ఈ వర్కింగ్ కమిటీ సమావేశానికి వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఇందులో భవిష్యత్‌లో జరుగనున్న ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. 
 
మరోవైపు, గత కొన్ని రోజులుగా ఆ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా పార్టీలో నమ్మకబంటుగా ఉంటూ వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అనేక సంచలనం ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో మిగిలిన  నేతలు సోనియా, రాహుల్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించే అవకాశం వుంది. మరోవైపు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ జోడో యాత్రను నిర్వహించనుంది. ఇందుకోసం రాష్ట్రాల వారీగా సమన్వయకర్తలను నియమించనుంది. వీరిలో ఏపీకి ఎస్వీ రమణ, తెంలగాణకు డాలీశర్మలు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments