Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దవాఖాన కిటికీ నుంచి దూకేసిన మహిళ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:39 IST)
కరోనాతో ప్రాణాలు కోల్పోయే వారు భారీగానే వున్నారు. కానీ కోవిడ్ సోకిందనే భయంతో, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడేవారు కూడా పెరిగిపోతున్నారు. చాలామంది చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కానీ మరి కొందరు కరోనా వచ్చాక డీలా పడిపోతున్నారు. తాజాగా కరోనాతో చికిత్స పొందుతున్న మహిళ దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా తీర్థంకర్ మహావీర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించబడిన మహిళను ఇటీవల వైద్య అధికారులు టీఎంఎంయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఉన్నట్టుండి ఆమె దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మహిళ కిటికీలో నుంచి దూకిన దృశ్యాలు వార్డులోని సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను భద్రపరిచామని, కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments