Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంకృషితో అత్యున్నతస్థాయికి ఎదిగిన ప్రణబ్ : ఉపరాష్ట్రపతి

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (19:09 IST)
స్వయంకృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన మహానేత ప్రణబ్ ముఖర్జీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ప్రణబ్ మృతిపట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 
 
ప్రణబ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ప్రణబ్ ముఖర్జీ సామాన్య స్థాయి నుంచి దేశ అత్యున్నత స్థాయికి స్వయంకృషితో ఎదిగారని కొనియాడారు. అలాగే, గతయేడాది ఆగస్టు 8వ తేదీన భారతరత్న పురస్కారం అందుకున్నారని గుర్తుచేశారు. 
 
ప్రణబ్ ముఖర్జీ తన జీవితాన్ని సామాన్య స్థాయి నుంచి ప్రారంభించి, స్వయంకృషి, క్రమశిక్షణ, అంకిత భావాలతో  దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మన దేశం ఓ గొప్ప పెద్ద మనిషిని కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments