Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త రికార్డు.. మహారాష్ట్రలో డేంజర్ బెల్స్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:49 IST)
దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,65,021 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా...53,476 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 251 నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు 1,17,87,534 కేసులు నమోదయ్యాయి. 
 
ఇందులో 1,12,31,650 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 3,95,192 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,60,692కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,490 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
మరోవైపు మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇలానే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వరకూ మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. 
 
అత్యధికంగా పుణె జిల్లాలో (61,125), తర్వాత నాగ్‌పూర్ (47,707), ముంబై (32,927)లలో అధిక కేసులు ఉన్నాయి. వచ్చే 11 రోజుల్లో మరణాల సంఖ్య కూడా 64 వేలు దాటనుందని అంచనా. ప్రస్తతం ప్రతి వారం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1 శాతం మేర పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments